Friday, April 19, 2024

భైంసాలో మార్చి 5న ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో మార్చి 5వ తేదీన ర్యాలీ నిర్వహించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు తెలంగాణ హైకోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. ర్యాలీలో 500 మందికి మించి పాల్గొనరాదని, మసీదులకు 300 మీటర్ల దూరంలో ర్యాలీ నిర్వహించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఏ మతాన్ని రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేయరాదని కూడా హైకోర్టు ఆదేశించింది. మసీదుల చుట్టూ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News