- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా నియమించే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల వేతానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంబిబిఎస్ చేసిన వారికి రూ. 40వేలు, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ కు రూ.లక్ష, ఆయూష్ డాక్టర్లకు రూ. 35వేలు, స్టాఫ్ నర్సులకు రూ.23 వేలు, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17వేలు ఇవ్వనున్నారు. అర్హులైన వారు మే నెల 22 వరకు ధరఖాస్తు చేసుకోవానలి సూచించింది ప్రభుత్వం. నిన్న కరోనా పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్షించారు. వైద్యఆరోగ్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని అధికారులకు సిఎం సూచించారు. రెండు నెలల కొరకు డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల నియమించుకోవాలని సూచించారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో సోమవారం నియామక నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు.
Telangana Medical Recruitment 2021
- Advertisement -