Friday, March 29, 2024

రెండో రౌండ్‌లోనూ సురభి వాణిదేవి ఆధిక్యం

- Advertisement -
- Advertisement -

telangana mlc elections 2021 results live

హైదరాబాద్: మహబూబ్‌నగర్, హైదరాబాద్- రంగారెడ్డి, పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల కౌంటింగ్ గురువారం కొనసాగుతోంది. రెండో రౌండ్‌ ఫలితాల్లోనూ టిఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సమీప అభ్యర్థి రామచందర్ రావుపై వాణీదేవి 2,613 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. రెండు రౌండ్లలో సురభివాణి దేవికి 35,171 ఓట్లు రాగా, బిజెపి అభ్యర్థి రామచంద్రరావు‌కు 32,558 ఓట్లు పోలయ్యాయి. మొదటి రౌండ్‌ ఫలితాల్లో సురభివాణికి మొదటి రౌండ్ లో సురభి వాణీదేవి(టిఆర్ఎస్)కి 17,439 ఓట్లు వచ్చాయి. రామచందర్ రావు(బిజెపి)కు 16,385, ప్రొ, నాగేశ్వర్ కు 8,357, చిన్నారెడ్డి (కాంగ్రెస్)కి 5,082, ఎల్. రమణ (టిడిపి)కి 929 ఓట్లు పడ్డాయి. మొదటి రౌండ్ లో 3,374 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.

telangana mlc elections 2021 results live

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News