- Advertisement -
భీంగల్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ శనివారం ఉదయం ప్రారంభమై కొనసాగుతోంది. కాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీని టిఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీ పరిధిలోని 12వార్డులో 1స్థానం ఏకగ్రీవం అవ్వగా… 11 స్థానాల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ స్వాతి సింగ్ పరాజయం పాలయ్యారు. 31వార్డులో బిజెపి అభ్యర్థి సంధ్య చేతిలో ఓటమి పాలయ్యారు. మరో వైపు కరీంనగర్ జిల్లాలోనూ టిఆర్ఎస్ దూసుకుపోతుంది. జిల్లాలోని జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టు సమాచారం.
Telangana municipal election results 2020
- Advertisement -