Friday, April 26, 2024

17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు… ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

Telangana National Unity Vajrotsavam

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ లు నగర ఎంఎల్ సిలు, ఎంఎల్ఎలతో, మేయర్, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో ఈనెల 17 వ తేదీన నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరాపార్కు వద్ద గల ఎన్ టిఆర్ స్టేడియంలో పర్యటించారు. హైదరాబాద్ లో 17 వ తేదీన పీపుల్స్ ప్లాజా నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా ఎన్ టిఆర్ స్టేడియం వరకు ఊరేగింపుగా చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని మంత్రులు వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను మంత్రులు నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులతో కలసి పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, రసమయి బాలకిషన్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, గిరిజన సహకార ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్ రామచంద్ర నాయక్, జిహెచ్ఎంసి అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News