Thursday, April 25, 2024

ఎపి సిఎం జగన్‌కు తెలంగాణ ప్రజలు థ్యాంక్స్ చెప్పాలి

- Advertisement -
- Advertisement -

cpi narayana

 

హైదరాబాద్ : సిపిఐ నేత నారాయణ మహబూబ్‌నగర్‌లో ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఎపి సిఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పాలన్నారు. ఎపిలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుం దన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని ఆయన విమర్శించారు. అటు బిజెపి పార్టీపైనా ఆయన ఆరోపణలు చేశారు. బిజెపి పార్టీని ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగ్రవాద బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని, విపక్షాలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు.

 

Telangana people should say thanks to AP CM pics
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News