Friday, March 29, 2024

రైస్ బౌల్ మనదే

- Advertisement -
- Advertisement -

Rice Bowl of India

 

త్వరలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానంపై ముసాయిదా
మంత్రివర్గం,అసెంబ్లీలో చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తాం
ఇకపై ప్రపంచమంతా కరువు వచ్చినా…. తెలంగాణలో రాదు
ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల
ధాన్యం పండుతుంది
40 లక్షల టన్నుల నిల్వ సామర్థానికి గోదాముల సంఖ్య పెంచుతాం
ఇక రైస్ మిల్లర్లకు అధికారుల వేధింపులు ఉండవు
రాష్ట్ర ప్రగతిలోనూ రైస్ మిల్లులను భాగస్వామ్యం చేస్తాం
ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వరి పంట దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణలో సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’ ను రూ పొందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వాములందరితో చర్చలు జరిపి, విధానాన్ని రూపొందించాలని అధికారులను సిఎం ఆదేశించారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అం డగా ఉండి, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ముసాయిదాపై త్వరలో మంత్రివర్గంలోనూ, అనంతరంఅసెంబ్లీలో కూడా చర్చించి నూతన విధానాన్ని ఆమోదిస్తామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ – అమ్మకం – ఎగుమతులు ఇందుకు అవలంభించాల్సిన విధానాలు తదిర అంశాలపై సోమవారం ప్రగతి భవన్‌లో సిఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి చాలా తేడా వచ్చిందన్నారు.

కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ తదితర కారణాల వల్ల రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతున్నదన్నారు. దీనివల్ల రాష్ట్రంలో వరిసాగు పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ సారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ పంటలతో కోటి లక్షల టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ సారి వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగే అవకాశముందన్నారు. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశం ఉంద ని సిఎం వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదన్నారు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

తెలంగాణ ప్రతి ఏడాది కనీసం 2.25 కోట్ల లక్షల టన్నుల క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నదన్నారు. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారు చేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని అని సిఎం పేర్కొన్నారు. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదని, ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం,బియ్యం విధానం అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. “తెలంగాణ వ్యాప్తంగా 2200 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. ఫలితంగా 20-,30 లక్షల టన్నుల బియ్యం తయారు చేయడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

ధాన్యం పుష్కలంగా ఉంది. 24 గంటల నిరంతరాయ కరెంటు ఉంది. దీన్ని మంచి అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాల్సి ఉంది. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా ఎఫ్‌సిఐకి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులు పూర్తి సామర్థ్యంతో పని చేయాలి. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. దీనికోసం ప్రభుత్వ పరంగా రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండడానికి ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం చేస్తాం. తెలంగాణలోని రైసు మిల్లులు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

ఇకపై రైసు మిల్లర్లపై అధికారుల నుంచి వేధింపులుండవని సిఎ స్పష్టం చేశారు. అనేక రకాల అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా విధానంలో ప్రభుత్వం మార్పులు తెస్తుందని భరోసా ఇచ్చారు. -రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలన్నారు. తెలంగాణ ప్రజలు ఏ రకం బియ్యం తింటారు? ఇతర రాష్ట్రాల వారు ఏ రకం బియ్యం తింటారు? అనే విషయాలను సరిగ్గా అంచనా వేసి, దానికి అనుగుణంగా ధాన్యం రకాలను పండించాలని సిఎం సూచించారు. వాటిని ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి ఇటు రాష్ట్ర ప్రజలకు, అటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపించాలన్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావంతో రైసు మిల్లుల్లో పనిచేసే హమాలీలో తమ సొంత రాష్ట్రమైన బీహార్ వెళ్ళారన్నారు. మళ్లీ సీజన్ వచ్చింది కాబట్టి, ప్రత్యేక బస్సుల్లో వారిని తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైసు మిల్లుల స్థాపనకు పారిశ్రామిక వాడల్లో స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు.

రైసు మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గా గుర్తించి, అసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని సిఎం హామి ఇచ్చారు. -రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు కేవలం 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే ఉండేవని, వాటిని 22 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి గోదాముల సంఖ్యను పెంచామని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు. దీన్ని 40 లక్షలకు తీసుకుపోవాలని అధికారులను ఆదేశించారు. రైసు మిల్లుల్లో గోదాములు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా తగిన సహకారం అందించాలని అధికారులకు సిఎం కెసిఆర్ సూచించారు. అలాగే రాష్ట్రంలో రైసు మిల్లులు ఎక్కువున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రైల్వే సైడింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు.

-రైస్ మిల్లుల ఎల్‌టి కేటగిరిని 70 హెచ్‌పిల సామర్థ్యం నుంచి 150 హెచ్‌పిల సామర్థ్యానికి పెంచే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంప నాగేందర్, మోహన్ రెడ్డి, నాయకులు చంద్రపాల్, బొచ్చు భాస్కర్, ప్రభాకర్ రావు, తోట సంపత్ కుమార్, కాంతయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

 

Telangana State as Rice Bowl of India
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News