Friday, April 19, 2024

మిసెస్ ఇండియా రన్నరప్‌గా తెలంగాణ మహిళ

- Advertisement -
- Advertisement -

జైపూర్ : రాజస్థాన్ వేదికగా జరిగిన మిసెస్ ఇండియా 2023 పోటీల్లో తెలంగాణకు చెందిన కిరణ్మయి అలివేలు రన్నరప్‌గా నిలిచారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఎంపికైన వారిలో 50 మంది ఫైనల్ చేరుకోగా, తుది పోటీల్లో కిరణ్మయి చక్కని ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచారు. మిసెస్ ఇండియా తెలంగాణ రీజినల్ డైరెక్టర్ మిసెస్ మమతా త్రివేదీ ఆమెకు మెంటర్‌గా వ్యవహరించారు. కిరణ్మయికి వీణా పుజారి దుస్తులు డిజైన్ చేయగా, 10 కేటగిరీల్లో 30 మందితో పోటీ పడ్డారు. టాలెంట్ రౌండ్ , డాన్స్ రౌండ్, సఫారీ రౌండ్‌తోపాటు ఫ్యాషన్ రౌండ్స్‌లో గట్టిపోటీ నడిచినప్పటికీ, జడ్జీలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానమిచ్చి కిరణ్మయి ఆకట్టుకున్నారు. ఇదే పోటీల్లో డైరెక్టర్ కేటగిరికి సంబంధించి బెస్ట్ డైరెక్టర్ అవార్డును మమతా త్రివేదీ గెలుచుకున్నారు. కిరణ్మయి గతంలో 2019 మిసెస్ ఇండియా తెలంగాణ ఎట్రాక్టివ్ టైటిల్ గెలిచారు.

వివాహం తరువాత కూడా మహిళలు కుటుంబానికి పరిమితం కాకుండా ఏదైనా సాధించ వచ్చు అనేది రుజువు చేసే ఉద్దేశంతో మిసెస్ ఇండియా పోటీలకు సిద్ధమయ్యారు. దాదాపు 8 నెలల పాటు ప్రిపేర్ అయి, జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీల్లో తన అందంతోపాటు మాట్లాడే తీరు, టాలెంట్, క్రియేటివిటీ వంటి అంశాల్లో ప్రతిభ కనబర్చి రన్నర్‌గా నిలిచారు. మిసెస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా ఒక తెలంగాణ మహిళ నిలవడం ఇదే తొలిసారి. కిరణ్మయిని పలువురు అభినందించారు. అందాల పోటీల్లో వివాహితులు కూడా రాణించ వచ్చని అనుకునే వారికి తాను రోల్‌మోడల్‌గా నిలవాలనే లక్షంతోనే జాతీయ పోటీల్లో పాల్గొన్నానని కిరణ్మయి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News