Friday, June 13, 2025

తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్

- Advertisement -
- Advertisement -

అద్దె ప్రాతిపదికన సినిమాలు
ప్రదర్శించలేమని తేల్చి చెప్పిన
ఎగ్జిబిటర్లు.. పర్సంటేజి
రూపంలో చెల్లిస్తేనే సినిమాలు
ప్రదర్శిస్తామని స్పష్టీకరణ ఈ
మేరకు నిర్మాతలకు లేఖ
రాయాలని నిర్ణయం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రా ష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె విధానంలో సినిమాలు ప్రదర్శించలేమని, పర్సెంటేజ్ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేయనున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య కొనసాగుతున్న పర్సెంటేజీల వివాదం మరోసారి చర్చ కు వచ్చింది. ఆదివారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఎగ్జిబిటర్లు సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జిబిటర్లు (థియేటర్ యాజమాన్యాలు) అంతా కీలక నిర్ణయానికి వచ్చారు. రెంటల్ సిస్టమ్ పట్ల అసం తృప్తి వ్యక్తం చేశారు.

అద్దె విధానంలో సినిమాలు ప్రదర్శించలేమని, పర్సెంటేజ్ రూపంలో చెల్లిస్తేనే ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. రెవెన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జూన్ 1 నుంచి తెలంగాణ, ఎపిలో థియేటర్లు మూసివేయాలని ప్రతిపా దించారు. త్వరలో ఎగ్జిబిటర్లు అధికారికంగా బంద్ నోటీసును సమర్పించనున్నట్లు సమాచారం. ఎఫ్‌డిసి ఛైర్మెన్ దిల్‌రాజు, సురేష్‌బాబుతో పా టు 60 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే పర్సెంటేజ్ విధానంపై పెద్దపెద్ద నిర్మా ణ సంస్థలు మౌనం పాటిస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రొడ్యూసర్లు పొందే ఆదాయం తగ్గే అవకాశం ఉండడంతో ఇబ్బందిగా ఫీలవుతున్నారు.

రెంటల్ విధానం అంటే ఏమిటి..?
నిర్మాతలు లేదా డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ప్ర దర్శించేందుకు థియేటర్లకు ఒక ఫిక్స్‌డ్ అద్దె చెల్లిస్తారు.
ఆ తర్వాత సినిమాకు ఎంత కలెక్షన్ వచ్చినా పెరిగిన లాభంలో వాటా ఉం డదు. ఆ ఫిక్స్‌డ్ అద్దె మాత్రం వారికి వస్తుం ది. దీనివల్ల నిర్మాతలు మాత్రమే లాభపడుతున్నారు. దురదృష్టవశాత్తు కొన్ని సినిమాలు ఆడకపోతే ఎగ్జిబిటర్లు నష్టాల్లో పడుతున్నారు. అందుకే ఇప్పుడు సినిమా లాభాల్లో పర్సెంటేజ్ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు కోరుతు న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News