Friday, April 19, 2024

హుస్నాబాద్ లో నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేయాలి: సతీష్ కుమార్

- Advertisement -
- Advertisement -

Tenders completed with in one month

కరీంనగర్: హుస్నాబాద్ నేషనల్ హై వే రోడ్డుకు నెల రోజుల్లో టెండర్ లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఎంఎల్ఎ వొడితెల సతీష్ కుమార్ తెలిపారు. మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవ తో హుస్నాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. సతీస్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాలు, గిరిజన తండాలకు పక్కా రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్  రోజా రాధాకృష్ణ శర్మ, ఆర్ డిఒ జయ చంద్రా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అజయ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News