Saturday, April 20, 2024

టిఎంసిలో చేరిన టెన్నీస్ స్టార్ లియాండర్ పేస్

- Advertisement -
- Advertisement -

Leander Paes joins TMC
కోల్‌కతా: ప్రముఖ టెన్నీస్ క్రీడాకారుడు గోవాలో తృణమూల్ కాంగ్రెస్(టిఎంసి)లో చేరాడు. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ లియాండ్‌ర్ పేస్ తనకు సోదరుడి వంటి వాడని పేర్కొన్నారు. “లియాండర్ పేస్ టిఎంసిలో చేరాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నాకూ సంతోషంగానే ఉంది. అతడు నాకు తమ్ముడి వంటి వాడు. నేను యువజన మంత్రిగా ఉన్నప్పటి నుంచి అతడిని ఎరుగుదును. అప్పుడతడు చాలా చిన్నవాడు” అని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి ఒక గంట ముందు నటుడు, కార్యకర్త నఫీసా అలీ కూడా టిఎంసిలో చేరారు. బిజెపికి పట్టున్న గోవాలో టిఎంసి తరఫున ప్రచారం చేయడానికి మమతా బెనర్జీ గురువారమే గోవా చేరుకున్నారు. ఆమె టిఎంసి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చే అర్హత లేకున్నా బిజెపి తనను హిందూ వ్యతిరేకి అన పేర్కొంటోంది’ అన్నారు. అసలు టిఎంసిలోని మూడు అక్షరాలు టెంపుల్,మస్జిద్, చర్చిలకు సంకేతంగా నిలుస్తాయన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున మమతా బెనర్జీ మూడు రోజుల పర్యటనపై ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఓట్లను చీల్చడానికి, గోవా రాష్ట్రాన్ని మరింత పటిష్టం, స్వయం సమృద్ధి చేయడానికే తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

2022లో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఆ రాష్ట్రంలో తమకు ఏ మాత్రం అవకాశం ఉంటుందో అంచనా వేసుకోడానికే మమతా బెనర్జీ గోవాలో మూడు రోజులపాటు పర్యటిస్తున్నారు. కాగా రానున్నగోవా అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లకు పోటీ చేయనున్నట్లు టిఎంసి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News