Friday, April 19, 2024

చనిపోయిన స్నేహితుని కుటుంబానికి వితరణ అందజేత

- Advertisement -
- Advertisement -

friends

 

మనతెలంగాణ / మణుగూరు టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రైల్వేస్టేషన్ దగ్గర గల గ్రామానికి చెందిన నాగుల నరేష్(31) గత నెల అశ్వాపురం నందు జరుగుతున్న ఒక ఇంటి గృహ నిర్మాణం పనుల్లో భాగంగా లారీ నుండి వచ్చిన మార్బుల్స్ దింపుతూ ఉండగా ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి స్నేహితులు 2005 పదో తరగతి జడ్పీహెచ్‌ఎస్ బ్యాచ్ విద్యార్థులు కలిసి వారి కుటుంబానికి ఆదివారం రూ.20500 లు ఆర్ధికసాయం అందజేశారు. అదేవిధంగా 75కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, లాలూ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News