Saturday, April 20, 2024

హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు… ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఉగ్ర కదలికల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ఎటిఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్, కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో హైదరాబాద్, భోపాల్‌లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఓ మెడికల్ కాలేజీ హెచ్‌ఒడి మహ్మద్ సలీమ్, ఎంఎన్‌సి కంపెనీలో క్లౌడ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అబ్దుల్ రెహ్మన్, పాతబస్తీలో డెంటిస్ట్‌గా పని చేసున్న షేక్ జునైద్‌లను కూడా అరెస్ట్ చేశారు. రోజువారి కూలీలు మహ్మద్ అబ్బాస్, హమీద్‌ను కూడా అరెస్ట్ చేశారు. మరో రోజు వారి కూలీ మహ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నారు. పట్టుబడిని వారికి హిజ్భ్ ఉత్ తహ్రీర్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని నిఘా సంస్థలు గుర్తించాయి.

Also Read: హైదరాబాద్ లో నీడ పోయింది.. రెండు నిమిషాలు జీరో షాడో!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News