- Advertisement -
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని అవంతిపూరాలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. బుడ్గమ్ జిల్లాలోని చడూర్ ప్రాంతంలో తీవ్రవాదుల దాడిలో సిఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జవాన్ ను ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -