- Advertisement -
న్యూఢిల్లీ: భూటాన్తో ఉన్న చాలా ప్రత్యేక మైత్రిని భారత్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని, రెండు దేశాల మధ్య ఈ మైత్రి కొనసాగ మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి మోడీ సోమవారం పేర్కొన్నారు. భూటాన్ ప్రధాని లోతయ్ షెరింగ్ భారత్కు పంపిన రిపబ్లిక్ డే సందేశానికి మోడీ స్పందించి ట్వీట్ చేశారు. కొన్ని దశాబ్దాలుగా భారత్తో సాగించిన ప్రయాణంలో భూటాన్ ప్రగాఢ స్ఫూర్తిని పొందుతోందని భూటాన్ ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు. ఉభయ దేశాల స్నేహసంబంధాలతో తాము సాహస ధైర్యాలను, విశ్వాసాన్ని జౌదార్యాన్ని పొందుతున్నట్టు వివరించారు. భారత్ మరింత శాంతి, పురోగతి సాధించాలని భూటాన్ ప్రధాని అభిలషించారు.
Thank You Bhutan PM’s Republic day Tweet: PM Modi
- Advertisement -