Friday, April 26, 2024

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఇక నేరం

- Advertisement -
- Advertisement -

Spitting

 

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
పాన్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు నిషేధం
ప్రత్యేక బృందాలతో నిత్యం మానిటరింగ్

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కఠిన శిక్షలు విధిస్తామంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎ. శాంతికుమారి బుధవారం ఓ సర్కూలర్‌ను జారీ చేశారు. రోడ్లు, సంస్థలు, కార్యాలయాలు, మార్కెట్లు, జనసంచారం కలిగిన ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. కొవిడ్ నియంత్రణలో బాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశా రు. వైరస్ వ్యాప్తిని అరికట్టే భాగంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి అని, అనారోగ్యకరమైన అలవాట్లను మానుకొని ప్రజలంతా ఆరోగ్యంగా తయారుకావాలని అధికారులు సూచించారు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తే ఆ తుంపర్లు ద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉన్నందున ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విదేశాల్లో ఈ నిబంధనలు అమలవుతుండగా తాజాగా కొవిడ్ ప్రభావంతో రాష్ఱ్రంలో తొలిసారిగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

పాన్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు నిషేధం
రాష్ట్రంలో పాన్, గుట్కా, పొగాకు సంబంధిత ఉత్పత్తులను ఇక నుంచి నిషేధిస్తున్నామని రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. ప్రజారోగ్యం దృష్టా బహిరంగ ప్రదేశాల్లో పాన్, ఇతర పదార్ధాలు ఉమ్మిఊయడం, గుట్కా, తదితర పదార్ధాలను నమిలి ఊ యడం పూర్తిగా నిషేదిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా రాష్ట్రం వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది పాన్, గుట్కా, పొగాకు ఇతర ఉత్పత్తులను నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. ఇంకొందరైతే వాహనాల మీద కూడా వెళ్తూ రోడ్లపై ఉమ్మేస్తున్నారు. దీంతో ఆ తుంపర్లు ద్వారా ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ముందస్తు జాగ్రత్తలతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మిన తుంపర్లను తొక్కిన వారికి కూడా ఇన్ఫెక్షన్లు ప్రబలే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ప్రత్యేక నిఘా
చాలా మంది వాళ్లకు ఏం బాధ్యత లేనట్లు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తుంటారు. ఎవరు ఏమీ అనరు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. బాధ్యత మరచి విచ్చలవిడిగా ఉమ్మేస్తుంటారు. కానీ ఈ సారి అలా వ్యవహరించే వారికి ప్రభుత్వం చెక్ పెడుతుంది. జీహెచ్‌ఎంసి, పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక టీంలు కూడా ఉమ్మేసిన వారిని గుర్తిస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు. పరిశుభ్రతే వైరస్ నిర్మూలనకు ప్రస్తుతం ముందస్తు వ్యాక్సిన్ కావున ప్రజలు దీన్ని పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్లు కూడా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా సమాజ హితం కోసం ఆలోచింది ఈ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని అధికారులు వెల్లడిస్తున్నారు. అదే విధంగా కాలనీలు, వీధుల్లో నివసించే ప్రజలు సైతం జీహెచ్‌ఎంసి ఏర్పాటు చేసిన చెత్తడబ్బాల్లో మాత్రమే ఉమ్మేయాలని అధికారులు ప్రకటించారు. వీధుల్లో ప్రజలు ఎక్కువ సంచరించే అవకాశం ఉన్నందుకు ఈ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా హైరిస్క్ గ్రూప్(గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, వృద్ధులు) వాళ్లు ఉమ్ముల పట్ల అత్యంత జాగ్రత్తతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

The crime of Spitting in public places
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News