లక్నో: మాజీ డిఐజి ఇంట్లో దొంగతనం కేసులో నిందితుడు పోలీస్ స్టేషన్లో మృతి చెందడంతో ఐదుగురు పోలీసులు సస్పెండైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలోని గోమతి నగర్ విస్తార్ పోలీస స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఉమేష్ కుమార్ అనే దొంగ మాజీ డిఐజి రాజ్ కుమార్ ఇంట్లో దొంగతనం చేయడంతో పోలీసులు ఉమేష్ పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉమేష్ పోలీస్ స్టేషన్లో అపస్మారక స్థితిలోకి పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ దొంగను పరీక్షించిన వైద్యులు చనిపోయాడని తెలిపారు. ఉమేష్ను డిఐజి ఇంట్లో చావబాదడంతో చనిపోయాడని ఆయన సోదరుడు ఆరోపణలు చేస్తున్నారు. బెల్డ్ సహాయంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని అందుకే ఆస్పత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఆ దొంగ ఉన్న గదిలో ఎటువంటి రక్తపు మరకలు లేవని మానవ హక్కులు సభ్యులు పేర్కొన్నారు. తలను రాయితో కొట్టుకోవడంతో చనిపోయాడని పోలీస్ అధికారి సోమేన్ బర్మా తెలిపాడు.