- Advertisement -
హైదరాబాద్: నగరంలోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది. తారానగర్ లోని రెహన్ నగల దుకాణంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 15 తులాల బంగారం, 15 కిలోల వెండి, రూ.4 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్టు షాప్ యజమాని తెలిపాడు. దొంగలు తెలివిగా సిసి కెమెరా ఫుటేజ్ ను కూడా ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దుండగుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
Theft at a jewelry store in chandanagar
- Advertisement -