Friday, March 29, 2024

ఢిల్లీలో లాక్‌డౌన్ ఉండదు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

There is no plan Lockdown in Delhi

 

ఢిల్లీ : దేశ రాజధానిలో మరికొంతకాలం లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఇక్కడ లాక్‌డౌన్ పొడిగిస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ వార్తలను కేజ్రీవాల్ ఖండించారు. అటువంటి ఆలోచన ఏదీ లేదన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఇప్పటికే ఇక్కడ మొత్తం 40000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర , తమిళనాడు తరువాత అత్యధిక సంఖ్యలో ఢిల్లీలో వైరస్ రోగులు ఉన్నారు. దీనితో ఇక్కడ వచ్చే కొద్ది రోజులలో మరింత కట్టడితో లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News