Wednesday, April 24, 2024

ఈసారి ఐపిఎల్ ట్రోఫీ మాదే

- Advertisement -
- Advertisement -

This time the IPL trophy is ours:Rishabh pant

రిషబ్ పంత్

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ఐపిఎల్ సీజన్14లో తమ జట్టు ట్రోఫీ సాధించడం ఖాయమని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ జోస్యం చెప్పాడు. తొలి దశ మ్యాచుల్లో తమ జట్టు అద్భుతంగా ఆడడంతో ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగే ఛాన్స్ దొరికిందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తమ జట్టు ఎంతో బలంగా ఉందన్నాడు. భారత్‌లో జరిగిన తొలి దశ మ్యాచుల్లో వరుస విజయాలు సాధించేందుకు సమష్టి ప్రతిభే కారణమన్నాడు. ఈసారి కూడా కలిసి కట్టుగా ముందుకు సాగుతామన్నాడు. తమ ముందున్న ఏకైక లక్షం ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడమేనని పంత్ స్పష్టం చేశాడు. సమష్టిగా రాణిస్తే ట్రోఫీని గెలవడం తమకు అసాధ్యమేమీ కాదన్నాడు. రెండు విభాగాల్లోనూ తమ జట్టు చాలా పటిష్టంగా ఉందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదన్నాడు. తొలి దశలో అద్భుతంగా రాణించిన శిఖర్ ధావన్, పృథ్వీషాలు ఈసారి కూడా అదే జోరును కొనసాగిస్తారనే నమ్మకం తనకుందన్నాడు. ఇక యుఎఇ పిచ్‌లపై తమ ఆటగాళ్లకు మంచి అవగాహన ఉండడం కూడా కలిసి వచ్చే అంశమన్నాడు. ఈసారి మరింత నిలకడైన ప్రదర్శనతో ట్రోఫీని సాధిస్తామనే నమ్మకాన్ని పంత్ వ్యక్తం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News