- Advertisement -
హైదరాబాద్: మూడేళ్లలోనే వైద్య కళాశాలకు పిజి వైద్య సీట్లు కేటాయించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మూడేళ్లలోనే మహబూబ్నగర్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసిన సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. దాదాపుగా 200 మంది వైద్య సిబ్బందితో ప్రజలకు వైద్య సేవలు అందించామని, త్వరలోనే మహబూబ్నగర్లో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంపై తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, ఈటెల రాజేందర్, ఎంఎల్ఎలు పాల్గొన్నారు.
- Advertisement -