Friday, April 26, 2024

అన్నారంలో దారుణం.. ఈతకు వెళ్ళి ముగ్గురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /గుమ్మడిదల: ఈత సరదా వారి ప్రాణాలను తీసింది. పాఠశాల అనంతరం ఇంటికి కాకుండా చెరువుకు వెళ్లి ఈత కొడదాం అనే నిర్ణయం వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చింది. వివరాలలోకి వెళితే.. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ శివారులో గల కొత్తకుంట చెరులో ఈతకు వెళ్ళిన ముగ్గురు పాఠశాల విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరు దుందిగల్ వాయు సేన అకాడమీలో గల కేంద్రీయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్నారు. చెరువు ఒడ్డున గల బట్టలను గమనించిన స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు చెరువులో వెతికించి మృతదేహాలను వెలికి తీసారు. చనిపోయిన వీరిని మహిపాల్(13), పల్లవ్‌కుమార్(14), సందీప్(13)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నామోదు చేసుకుని విచారణ చేస్తామని..  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరువు ఆసుపత్రికి పంపించామని పోలీసులు తెలిపారు.

three 8th Class Students drowned in lake in Sangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News