Thursday, April 25, 2024

చెరువులో బాలికల మృతదేహాలు….

- Advertisement -
- Advertisement -

Three dead bodies found in lake

నిర్మల్: చెరువులో మూడు మృతదేహాలు కనిపించిన సంఘటన నిర్మల్ జిల్లా తానూర మండలం సింగన్‌గావ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సింగన్‌గావ్‌లో చెరువులో మూడు మృతదేహాలు తేలియాడుతుండడంతో పోలీసులు బయటకు తీశారు. మృతులు సునీత(16), వైశాలి(14), అంజలి(14)గా గుర్తించారు. వైశాలి, అంజలి ఒకే కుటుంబానికి చెంది అక్కాచెల్లెళ్లు. బాలికలు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదవశాత్తూ పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News