Friday, April 26, 2024

చెరువులో ముగ్గురు అక్కా చెల్లెళ్ల మృతదేహాలు…. తండ్రిపై అనుమానం

- Advertisement -
- Advertisement -

 

బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజారామ్ దుబ్బ చెరువులో ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. మృతులు అఫీయా(10), మహీన్(9), జోయా(7)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో తండ్రి ఫయాజ్ తన కుమార్తెలను హత్య చేసినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తండ్రి ఫయాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Three dead bodies of same family found in Lake
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News