Thursday, April 18, 2024

కర్మన్‌ఘాట్‌ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కర్మన్‌ఘాట్‌ చౌరస్తాలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదనానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో చనిపోయినవారిని వినాయక్, సాయి, శ్రీనివాస్ లుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Three dead in Car Accident at Karmanghat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News