Tuesday, April 23, 2024

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Death in Road Accident At Siddipet District

సిద్దిపేట: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు ఘోరరోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆటోను ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులను చాట్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ (35 ), కనకయ్య(35), శ్రీశైలం (26 )గా గుర్తించారు. అయితే, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ చాట్లపల్లి గ్రామస్తులు ఘటనాస్థలిలో రాస్తారోకో చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. అయినప్పటికీ గ్రామస్తులు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని రోడ్డుపైనే బైఠాయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News