Friday, March 29, 2024

పంజాబ్‌లో రెండు బస్సులు ఢీ

- Advertisement -
- Advertisement -
Three Died in Two Buses Collided In Moga
ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల మృతి

మోగ: పంజాబ్‌లోని మోగ జిల్లాలో అమృత్‌సర్‌కు వెళ్లే రహదారిపై శుక్రవారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముగ్గురు మరణించగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ పిసిసి అధ్యక్షునిగా నవజోత్ సింగ్ సిద్ధూ బాధ్యతలు చేపట్టనున్న కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులతో జీరా పట్టణం నుంచి అమృత్‌సర్‌కు వెళుతున్న మినీ బస్సు పంజాబ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును ఢీకొంది. మినీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు మరణించగా మరో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని లూధియానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు మోగ డిసిపి సందీప్ హంస్ తెలిపారు. బస్సు ప్రమాదంలో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు మరణించడం, మరికొందరు కార్యకర్తలు గాయపడడం విచారకరమని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్వీట్ చేశారు. ప్రమాదంలో మరణించిన పార్టీ కార్యకర్తలకు సంతాప సూచనగా సిద్ధూ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో పార్టీ నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News