Thursday, April 25, 2024

వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three drowned in Maneru vagu at peddapalli

సుల్తానాబాద్ : పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మానేరు వాగులో ఎనిమిది మంది కుటుంబసభ్యులు స్నానానికి వెళ్లారు. అందులో ముగ్గురు గల్లంతయ్యారు. వాగులో కోట్టుకుపోతున్న ఐదుగురిని స్థానికులు కాపాడారు. బాధితులను వేములవాడ వాసులుగా గుర్తించారు. ఈ దుర్ఘటనలో మనోజ్, అశ్వంత్, వేములవాడకు చెందిన రాహుల్ మృత్యువాతపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్ లు మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Three drowned in Maneru vagu at peddapalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News