Thursday, April 25, 2024

సెల్ఫీల సరదాతో చెరువు పాలు

- Advertisement -
- Advertisement -

యుపిలో ముగ్గురు బాలికల విషాదాంతం

లక్నో : చెరువులో పడవ ప్రయాణం. పైగా కేరింతల నడుమ సెల్ఫీ సరదా. ఈ సంబరం చివరికి ముగ్గురు బాలికల జలసమాధికి దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది. దీని వివరాలను శనివారం పోలీసు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డియోరియా ప్రాంతంలో చెరువులో వీరు పడవలో సరదాగా వెళ్లుతున్నారు. 8 నుంచి 12 ఏండ్ల లోపున ఈ బాలికలు చుట్టూ నీళ్లు మధ్యలో తమ ప్రయాణం అనుభవాలను ఇతరులతో పంచుకుందామని సెల్ఫీలకు దిగారు. దీనితో బోటు అదుపు తప్పింది. ఆటుపోట్లకు గురైంది. వీరు సుడులు తిరిగే నీళ్లలో పడి కొట్టుకుపొయ్యారని అధికారులు తెలిపారు. మహాదేవ్ తాళ్ జలాశయంలో ఏడుగురు బాలికలు పడవలో వెళ్లుతుండగా భలౌనీ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ఇతర బాలికలు ఏదో విధంగా తప్పించుకున్నారు. ముగ్గురు నీట మునిగారు. పడవ నడిపిన వ్యక్తి ఒడ్డుకు సురక్షితంగా చేరుకున్నాడని స్థానిక కలెక్టర్ నిరంజన్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News