Friday, April 19, 2024

కృష్ణా జిల్లాలో విషాదం

- Advertisement -
- Advertisement -

Three Girls killed in car door lock at krishna district

అమరావతి: కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం రేమల్లెల్లో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ముగ్గురు బాలికలు మృతి చెందారు. ముగ్గురు బాలికలు ఆడుకుంటూ కారులోకి వెళ్లారు. కారు డోర్ లాక్ కావడంలో ఊపిరాడక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సింటక్స్ సంస్థ కార్మికుల గృహ సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు ముగ్గురూ ఆరేళ్ల వయసు బాలికలు. మృతులు సుహానా పర్విన్, యాస్మిన్, అఫ్సానాగా నిర్దారించారు. బాలికల స్వస్థలం ఇద్దరు బెంగాల్ , ఒకరు అసోం బాలికగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. చిన్నారులు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Three Girls killed in car door lock at krishna district

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News