Wednesday, April 24, 2024

ఎపిలో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three killed in lightning strike in AP

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో వేర్వురు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ఎపి రాష్ట్రంలో ఆదివారం నాడు పలు జిల్లాల్లో ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.ఈక్రమంలో అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి సమీపంలో పిడుగుపాటుకు ఇద్దరు పశువుల కాపరులు మృత్యువాత పడ్డారు. మృతులు మోహన్‌లాల్ నాయక్, తిమ్మప్పగా గుర్తించారు. భారీ వర్షాలకు పెన్నా నది, కుశవతి నదులు నీటి ప్రవాహంతో కళకళలాడుతున్నాయి. అలాగే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉరుములు ,మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శ్రీకాళహస్తి మండలం రెడ్డిపల్లిలో పశువుల మేపేందుకు వెళ్లిన గురు కిరణ్ (14) పిడుగుపాటుకు మృతి చెందాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News