Saturday, April 20, 2024

ఘోర రోడ్డుప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురి మృతి

- Advertisement -
- Advertisement -

Three Killed in Road Accident At East Godavari

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం గోపాలపురంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఓ బైక్ ను వ్యాన్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను గోపాలపురానికి చెందినవారిగా గుర్తించారు. కడప జిల్లా మైదుకూరు నుంచి కాకినాడ వైపు టమాట లోడ్ లారీ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.

Three Killed in Road Accident At East Godavari

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News