Thursday, April 18, 2024

లారీని ఢీకొన్న బైక్: ముగ్గురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

Three killed in Road accident at Jagtial

హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో బుధవారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ సంఘటన మేడిపల్లి నుంచి జగిత్యాల వైపు వెళ్తుండగా చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన బైకు కారును అధిగమించబోయి లారీని డీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదంలో మేడిపల్లి వాసులు శ్రీకాంత్(27), నవీన్(23), పవన్(22)గా పోలీసులు గుర్తించారు.

Three killed in Road accident at Jagtial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News