Friday, March 29, 2024

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దషాపూర్ తండా వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన గుర్తుతెలియని వాహనం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను గోపాల్(47), అంజలి(42), స్వాతి(09)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News