- Advertisement -
అమరావతి: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పమిడిముక్కల మండలం గురజాడ వద్ద అదుపుతప్పిన కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా…. మరో ఎనిమిది మంది తీవ్రగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే వీరు స్నేహితుల దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం బీచ్ కు వెళ్లి వస్తుతండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు చెబుతున్నారు. మృతులను విజయవాడ వాసులు అమర్, యూసఫ్, శివరాజ్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -