Thursday, April 25, 2024

యుపిలో భారీ వర్షాలు.. భవనం కూలి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు ధాటికి రోడ్లన్నీ జలమయాంగా మారాయి. ముజఫర్ నగర్‌లో ఓ భవనం కూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, అధికారులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన పర్వేజ్(18), నగ్మా(21), సైరా(40), ఇంతియాస్(45)లను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు అలీశా(30), జుబేదా(35), మీనా(65)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News