Wednesday, April 24, 2024

టీ షాపులోకి దూసుకెళ్లిన బస్సు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three members dead in bus enter into tea shop

లక్నో: బస్సు అదుపుతప్పి టీ షాపులోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం షహనాజ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై బస్సు అతివేగంగా ప్రయణించడంతో పాటు అదుపుతప్పడంతో టీ షాపులోనికి దూసుకెళ్లింది. టీ స్టాల్‌లో ఉన్న ముగ్గురు ఘటనా స్థలంలో మృతి చెందగా బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News