Thursday, April 25, 2024

చెట్టును ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఐదుగురు స్నేహితులు కలిసి మారేడుమిల్లి పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు కారులో వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో చెట్టును వారి వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు పులి ప్రవీణ్ కుమార్, పర్ణసాయి, భరత్‌గా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News