Thursday, April 25, 2024

చెరువులో పడిన కారు: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

రామన్నపేట: తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి చెరువులో కారు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు సర్నెని గూడె సర్పంచ్ భర్త మధు, కుమారుడు, డ్రైవర్ ఉన్నట్టు గుర్తించారు. పోలీసులుకు గ్రామస్థులు సమాచారం ఇచ్చి చెరువులో పడిన కారును బయటకు తీస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Three Members Dead in Car fell into Lake in yadadri

 

Three Members Dead in Car fell into Lake in yadadri
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News