Thursday, March 28, 2024

చేగుంటలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three Members dead in Lorry Bike accident

 

మెదక్: లారీ-బైక్ ఢీకొన్న సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం కేంద్రంలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతసాగర్ రోడ్డులో జీవికా పరిశ్రమ నుంచి వస్తున్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు.  మృతులు పల్లె రాకేష్(21), పల్లె ప్రదీప్(17), పండ్ల అరవింద్(15) గుర్తించారు. పల్లె ప్రదీప్ పదో తరగతి, పల్లె అరవింద్ (15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బైక్ పై డ్రాప్ చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.   తిమ్మాయిపల్లిలో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. బాధితుల బంధువులు, మృతులు జీవికా పరిశ్రమ ముందుకు చేరుకొని ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News