Thursday, April 25, 2024

బైక్ ను ఢీకొట్టిన లారీ: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three members dead in Lorry collided Bike

యాదాద్రి: బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి మండలం చౌటుప్పల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా పిట్టంపల్లిలో పెళ్లి వేడుక ఉండడంతో హరీష్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ధర్మోజీగూడెంలో వేబ్రిడ్జి వద్ద లారీ రివర్స్ చేస్తుండగా బైక్‌ను ఢీకొట్టింది. ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హరీష్‌ది పిట్టంపల్లికాగా మరో ఇద్దరిది రామంతాపూర్‌గా గుర్తించారు. ముగ్గురు ఎసి మెకానిక్‌లుగా పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News