- Advertisement -
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడ దరణి కాటన్ మిల్ సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్వాలీస్ వాహనం ఎక్సల్ రాడ్ విరిగి పోవడంతో ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతులు మల్లికార్జున్ రెడ్డి, రాజ లక్ష్మీ , దేవాన్షు రెడ్డిలుగా గుర్తించారు.
- Advertisement -