Saturday, April 20, 2024

జొన్న రొట్టెలు తిని ముగ్గురు మృతి… ఇద్దరి పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

Three members dead in Sorghum bread
పల్వట్ల: సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం పల్వట్లలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. రాత్రి జొన్న రొట్టెలు తిని ఐదుగురు కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 15 రోజుల క్రితం కూడా అదే కుటుంబంలో ఓ మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ వినియోగించిన జొన్న పిండిని కుటుంబ సభ్యులు రొట్టెలు చేశారు. జొన్న పిండిలో విష పదార్థం కలిసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News