Thursday, April 18, 2024

కారు ప్రమాదం… ముగ్గురు పరిస్థితి విషమం…

- Advertisement -
- Advertisement -

Three Members injured in Car accident

మహబూబ్ నగర్: కారు అతివేగంగా వెళ్లి ముగ్గురు పాదచారులను ఢీకొట్టిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని వెల్దొండ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై వెల్దొండ ప్రాంతంలో కారు అదుపు తప్పి ముగ్గురిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడడంతో ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News