- Advertisement -
హైదరాబాద్: పాల వ్యాన్ ఢీకొని ముగ్గురు పాదచారులు గాయపడిన సంఘటన హైదరాబాద్లోని నందిగామా పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకగూడ శివారు ప్రాంతం నాట్కో ఫార్మా దగ్గర జరిగింది. మహబూబ్ నగర్ నుంచి మేకగూడకు పాల వ్యాన్ వస్తుండగా హెడ్ లైట్ల నుంచి వెలుతరు రాకపోవడంతో పాదచారులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. మేకగూడకు చెందిన సందప్ రెడ్డి(20), సంతోష్ రెడ్డి(13), భార్గవ్ రెడ్డి(20) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంతోష్ రెడ్డి తీవ్రంగా గాయపడడంతో జూబ్లీహిల్స్లోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు.
Three Members injured in Milk van accident in Hyd
- Advertisement -