Thursday, March 28, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

Three members of same family were killed in Road accident

జనగామ : జనగామ – సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల ఘనపురం మండలం వనపర్తి స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన శేఖర్ రెడ్డి భార్య ధనలక్ష్మి కుమారుడు రఘుమారెడ్డితో కలిసి తిరుమలగిరిలో వాళ్ల బావ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కార్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో వనపర్తి సమీపంలో కారు టైర్ పేలిపోవంతో కారు అదుపు తప్పి తుమ్మలగూడెం నుంచి జనగామకు బర్రెల లోడుతో వస్తున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. టాటా ఏస్‌ వాహన డ్రైవర్‌ తీవ్రంగా గాయపడటంతో జనగామ దవాఖానకు తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News