Friday, March 29, 2024

ఎంఎల్ ఎ కోటాలో ముగ్గురు ఎంఎల్ సిలు ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్ ఎ కోటా ఎంఎల్ సిలో ముగ్గురు బిఆర్ ఎస్ ఎంఎల్ సిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. ఆర్వో నుంచి ముగ్గురు బిఆర్ఎస్ ఎంఎల్ సిలు ధృవీకరణపత్రాలు అందుకున్నారు.

దేశపతి శ్రీనివాస్

తెలంగాణ కవి, గాయకుడైన దేశపతి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో స్వర్గీయ దేశపతి గోపాలకృష్ణశర్మ, శ్రీమ తి బాలసరస్వతి దంపతులకు 1970లో జన్మించా రు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ నాయ కుడు, నేటి రాష్ట్ర సారథి సిఎం కెసిఆర్ నిర్వహించిన వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీలో దేశపతి పా ల్గొన్నారు. తెలంగాణా మలి దశ ఉద్యమంలో తన ఆట, పాట, ప్రసంగాలతో భావజాల వ్యాప్తికి కృషి చేశారు. రాష్ట్ర సాధన అనంతరం తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సిఎం ఓఎస్‌డిగా పనిచేస్తున్నారు. దేశపతి కృషిని గుర్తించిన సిఎం కెసిఆర్ ఆయనకు శాసనమండలి అభ్యర్థిగా అవకాశమిచ్చారు.

కుర్మయ్య గారి నవీన్ కుమార్

హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్ కుమార్ 1978 మే 15వ తేదీన జన్మించారు. వారి తల్లిదండ్రులు కొండల్‌రావు, తిలోత్తమలు. నవీన్‌కుమార్ తాత రామచంద్రరావు గతంలో మం త్రిగా పనిచేశారు. నవీన్ కుమార్ మేనమామ సుదర్శన్ రావు టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. విద్యార్థి దశ నుంచే నవీన్ కుమార్ కు రాజకీయాలంటే ఆసక్తి. 2001 నాటి జలదృశ్యం ఆ విర్భావ సభ మొదలుకొని టిఆర్‌ఎస్ నిర్వహించిన అన్ని సమావేశాల్లో నవీన్ క్రియాశీలంగా పనిచేశా రు. వ్యాపారం, రాజకీయాలతోపాటు ఆధ్యాత్మిక కా ర్యక్రమాల్లో నవీన్ కుమార్ చురుగ్గా పాల్గొంటారు. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో సొంత ఖర్చులతో వేంకటేశ్వర ఆలయాన్ని నవీన్‌కుమార్ నిర్మించారు. ఆ యన 2019 మే నెలలో ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. ఈనెల 29వ తేదీన ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన సిఎం కెసిఆర్ నవీన్ కుమార్‌కు మరోసారి ఎంఎల్‌సిగా అవకాశం ఇచ్చారు.

చల్లా వెంకట్రామిరెడ్డి

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురి కొడుకు) చల్లా వెంకట్రామిరెడ్డి. తొలుత పుల్లూ రు గ్రామ ప్రెసిడెంట్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం చల్లా వెంకట్రామిరెడ్డి 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎం ఎల్‌ఎగా పనిచేశారు. గతేడాది డిసెంబర్‌లో కాం గ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో చల్లా వెంకట్రామిరెడ్డికి సిఎం కెసిఆర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News