Tuesday, April 23, 2024

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎపిలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే .. స్థానికుల కథనం ప్రకారం లారీ అదుపుతప్పి అతి వేగంగా కారును ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన అంబేద్కర్ కోనసిమా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన లో సంఘటన స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు.

కాగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News