- Advertisement -
న్యూఢిల్లీ : ఫ్రాన్స్ నుంచి మూడో బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలు మూడు బుధవారం సాయంత్రం భారత్కు చేరాయి. తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్, చైనా మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న సమయంలో భారత్ శక్తి సామర్థాలను ఇతోధికంగా పెంచుకునేలా ఇవి భారత్ వాయుసేన దళాల్లో చేరడం విశేషం. ఈ కొత్త బ్యాచ్ రావడంతో రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య 11కు చేరింది. మొదటి బ్యాచ్ రఫేల్ విమానాలు గత ఏడాది జులై 29న రాగా, రెండో బ్యాచ్ విమానాలు గత ఏడాది నవంబర్ 3న చేరాయి. రష్యా నుంచి సుఖోయి జెట్స్ భారత్కు దిగుమతి అయిన 23 ఏళ్ల తరువాత ఈ రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి వచ్చాయి.
- Advertisement -