న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లోని కుల్గాంలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొన్ని వారాలుగా జమ్మూకాశ్మీర్ లో వరస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కుల్గాం జిల్లాలోని నాగ్నాడ్ చిమ్మర్ ప్రాంతంలో ఉగ్రవాదులు కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టారు. ఉగ్రవాదులకు, జవాన్లుకు మధ్య భారీ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సిఆర్పిఎఫ్ జవాన్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Three terrorists killed in encounter at Kulgam